Sunday, 22 August 2021

బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి శుభవార్త.. ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్!

 

మీరు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు జన్ ధన్ అకౌంట్ తెరవండి. బ్యాంక్‌కు వెళ్లి ఉచితంగానే మీరు ఈ ఖాతా తెరవొచ్చు. దీని వల్ల ఉచితంగా రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.

    

bank account


దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో జన్ ధన్ ఖాతా కూడా ఒకటి. బ్యాంక్‌లో ఈ అకౌంట్ కలిగిన వారికి ఉచితగానే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు.

జన్ ధన్ ఖాతా కలిగిన వారికి పీఎన్‌బీ రూపే జన్ ధన్ కార్డు అందిస్తారు. ఈ కార్డు కలిగిన కస్టమర్లకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రమాద బీమా రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే రూపే కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. కనీసం ఏటీఎం నుంచి అప్పుడప్పుడు డబ్బులు అయినా తీసుకుంటూ ఉండాలి.

ప్రమాదవశాత్తు ఖాతా కలిగిన వారు మరణిస్తే.. అప్పుడు కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఇన్సూరెన్స్ డబ్బులు అందిస్తారు. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మాత్రమే కాకుండా మీకు దగ్గరిలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి ఈ ఖాతా తెరవొచ్చు. అయితే మీరు మరే ఇతర బ్యాంక్‌లో కూడా అకౌంట్ కలిగి ఉండకూడదు.


No comments:

Post a Comment