Wednesday, 26 February 2020

'అవును.. నాకు తెలుసు': కేసీఆర్‌తో ట్రంప్‌

  • అధికారిక విందులో ట్రంప్‌తో కేసీఆర్‌ కరచాలనం
  • ఇవాంకా హైదరాబాద్‌ పర్యటనను గుర్తు చేసిన సీఎం
హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా తన వద్దకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సీఎం కేసీఆర్‌ తొలుత చేతులు జోడించి నమస్కారం పెట్టారు.

ప్రతిగా చేయి చాచిన ట్రంప్‌తో కరచాలనం చేశారు.
తనను తాను పరిచయం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంకా ట్రంప్‌ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిగా ట్రంప్‌ చిరునవ్వు నవ్వుతూ 'అవును నాకు తెలుసు' అన్నట్లు సమాచారం. అనంతరం.. పక్కనే ఉన్న రాష్ట్రపతి కోవింద్‌, ట్రంప్‌ సతీమణి మెలానియాకు నమస్కారం పెట్టి, తర్వాత కరచాలనం చేశారు. కాగా, ట్రంప్‌ విందుకు ఆహ్వానించిన సమయంలోనే వెంట ఏమీ తీసుకురావద్దని రాష్ట్రపతి భవన్‌ స్పష్టంగా తెలియజేయటంతో సీఎం కేసీఆర్‌ తనతోపాటు ఏ కానుకలనూ తీసుకెళ్లలేదు.

Tuesday, 25 February 2020

బిగ్ బ్రేకింగ్; ఢిల్లీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్...!

దేశ రాజధాని ఢిల్లీ లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీ లో పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. దీనితో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారి చేసారు ఢిల్లీ పోలీసులు. ఆందోళనలను అదుపులోకి తీసుకోచ్చేందుకే ఈ నిర్ణయం అని చెప్పారు. సియెఏ వ్యతిరేక వర్గానికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ,ముఖ్యంగా చాంద్ బాగ్ లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళన కారులపై భాష్పావాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు.


ముఖ్యంగా ఆ ప్రాంత౦ లో షాపులు, బైక్ లకు, కార్ లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళన కరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ పరిస్తితిపై ఆందోళన వ్యక్తం చేసారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్ట౦ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇది హింసకు దారి తీసింది. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
ఇప్పటికే ఈ ఆందోళనల్లో పది మంది మరణించారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్ కమీషనర్ గా ఆర్ శ్రీవాస్తవ ను నియమించారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో రేపు స్కూల్స్ కి సెలవు ప్రకటించారు అధికారులు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని చెప్తుంది. కేంద్రం కూడా ప్రత్యేక బలగాలను ఆ ప్రాంతంలో మోహరించింది.

Friday, 14 February 2020

కరోన వైరస్ కు ఉపసమానం!

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఎన్నో దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా 'కోవిడ్‌-19'గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా 'కోవిడ్‌-19' వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మృతుల సంఖ్య వెయ్యి దాటింది. చైనాలో ఇప్పటివరకూ 1016 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 42వేల 638 మందికి వైరస్‌ సోకింది. రోగుల సంఖ్య పెరుగుతుంటే… మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 108 మంది చనిపోగా, 2వేల 478 మందికి అదనంగా ఈ వైరస్ సోకింది. తాజాగా యూఏఈలోని దుబాయిలో మరో భారతీయుడు కరోనా బారినపడ్డారు. ఇప్పటికే కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా… వారిలో ఒకరు కోలుకున్నారు.

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కాస్తంత ఉపశమనం దొరికినట్లైంది. వాస్తవానికి ఈ వైరస్‌ని నివారించేందుకు ఇంతవరకూ మందును కనిపెట్టలేదు. కానీ, ఈ వైరస్‌ను నియంత్రించాలంటే స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో కరోనా వైరస్ సోకిన రోగులను ఉంచితే.. ఆ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటుగా ఏసీల వాడకం మానేసి.. ఫ్యాన్లను వాడాలని సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు.. చేతుల్ని ఎప్పటికప్పుడు సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవటం వల్ల కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చంటున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 163కు చేరింది. గాంధీ, ఫీవర్‌, ఉస్మానియా ఆస్పత్రుల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది. కాగా, వీవీఐపీల కోసం గాంధీలో పెయిడ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. వార్డుల్లో ఉండేందుకు వీవీఐపీలు విముఖత చూపుతున్నారని, వారి కోసం ఏడో బ్లాక్‌లో వీఐపీలకు కరోనా టెస్టులు చేయనున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన ఫీజుల మేరకే వసూలు చేయనున్నట్లు చెప్పారు.. ప్రస్తుతం ఐదు బెడ్లతో వీఐపీ సౌకర్యం కల్పిస్తున్నట్లు డాక్టర్‌ శ్రవణ్‌ వివరించారు.
DailyhuntRepo